ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు కోర్టులో ఊరట లభించింది. మంత్రి కన్నా బాబు పై ఉన్న ఎన్నికల కేసును విజయవాడ ప్రత్యేక న్యాయ స్థానం కొట్టేసింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు కన్నబాబు. ఆ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆయనపై పోటీచేసిన నురుకుర్తి వెంకటేశ్వరరావు అప్పట్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎన్నికల అధికారులు విచారణ జరిపారు. తాజాగ ఈ కేసును కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2009 ఎన్నికల్లో కన్నబాబు పీఆర్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యటంతో కన్నబాబు వైసీపీ వైపు నిలిచారు.