• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » లక్షన్నర కోట్లు ఫ్యామిలీ ప్యాకేజ్ కోసమే..

లక్షన్నర కోట్లు ఫ్యామిలీ ప్యాకేజ్ కోసమే..

Last Updated: August 25, 2019 at 6:02 pm

మధిర: కేవలం రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కమిషన్ల కోసం చంపేసి.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల అంచనాలతో రీ డిజైనింగ్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పేరుతో రూ.50 వేల కోట్లతో మరో ప్రాజెక్ట్ చేపట్టారని అంటూ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇటు సాగు, అటు తాగు నీటి అవసరాలు తీరడమేకాకా లక్ష 50 వేల కోట్ల రూపాయలు మిగిలేవని అన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకెందుకు మాత్రమే చేపట్టినవని భట్టు విక్రమార్క దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర నిధులు ఏ విధంగా దోపిడీ అవుతున్నాయో రాష్ట్ర ప్రజానీకానికి వివరించేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పర్యటన చేస్తున్నానని మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలను లెక్కలతో సహా వివరిస్తామని తెలిపారు.  తెలంగాణ వరప్రదాయినిగా కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చిందని అన్నారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేసి.. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని సరఫరా చేసేందుకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ఆరంభమై.. చేవెళ్ల వరకు తాగు, సాగునీటిని అందించేలా రూ. 38 వేల కోట్లతో అంచనాలతో ‘ప్రాణహిత’ను రూపొందించారని చెప్పారు. అందులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లతో పనులు చేసిందని వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి వుంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్‌ను మూడేళ్ళలో పూర్తిచేసినా పదహారున్నర లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవని, అంతేగాక తెలంగాణలోని 80 శాతం ప్రాంతానికి తాగునీరు లభించేదని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నీటి అవసరాలు కూడా తీరేవని చెప్పారు.

Primary Sidebar

తాజా వార్తలు

పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ను నిర్భందించిన గ్రామస్తులు

టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా..ప్రజలను మోసం చేస్తున్నారు!

అడవి మనది..హక్కులు మనవి..మనల్ని ఆపేదేవరు: భట్టి!

రాజశేఖర్‌ సొంత ఊరిలో సిట్‌ విచారణ

మళ్లీ ఉద్యోగులకు.. అమెజాన్ బిగ్ షాక్!

తాడు బొంగరం లేని వాళ్లంతా మాట్లాడేవారే!

ఆ గిఫ్టులు ఎక్కడ.. ట్రంప్ ను ఆరా తీస్తున్న కాంగ్రెస్ కమిటీ…!

బీజేపీ అదానీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు: మంత్రి ఇంద్ర కరణ్‌!

పేపర్ లీకేజీ కేసు… హైకోర్టు కీలక ఆదేశాలు..!

ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత..సొమ్మసిల్లిన ఏబీవీపీ నేతలు!

సిట్ తో కాదు..సీబీఐతో విచారించాలి!

ఆడబిడ్డ పై మీ ప్రతాపమా? : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ఫిల్మ్ నగర్

nivedha pethuraj comments on viswaksen he will become a successful director

విశ్వక్‌ ఒక లోకేశ్‌ కనగరాజ్‌ లా అవుతాడు!

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ ...!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap