అది మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేటలోని నారాయణ పేట నుంచి హైదరాబాద్కి బయలుదేరిన ఓ ఆర్టీసీ బస్సు. వెళ్తున్న బస్సుని వెంబడించి మరీ 10 లక్షల రూపాయలు దోచుకుపోయాడు.
సినిమాను తలపించే ఈ సీన్ బస్సులో ఉన్న వారినే కాదు. అందర్నీ షాక్ కి గురిచేసింది. నారాయణపేటలో నివాసం ఉంటున్న శివ అనే బంగారం వ్యాపారి.. ఆ బస్సులో ప్రయాణిస్తున్నాడు.రాజేంద్రనగర్లో వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధ్యాహ్నం నారాయణ పేట నుంచి హైదరాబాద్కి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేటలో నివాసం ఉంటున్న శివ అనే బంగారం వ్యాపారి.. ఆ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతని వద్ద రూ.10 లక్షలున్న బ్యాగ్ ఉంది.
ఈ బస్సును ముందు నుంచే బైక్పై వెంబడిస్తూ వస్తున్న ఓ దుండుగుడు.. శివరాంపల్లి పోలీస్ అకాడమీ సమీపంలో పిల్లర్ నెంబర్ 42 వద్ద బస్సుకు ఎదురుగా వచ్చి బైక్ను అడ్డం పెట్టాడు.
బస్సు ఆగడంతో.. ఆ నిందితుడు నేరుగా బస్సులోకి ఎక్కి, బంగారు వ్యాపారి శివ సీటు వద్దకు వెళ్లాడు. శివ కంట్లో కారం చల్లి, అతని చేతిలో ఉన్న రూ.10 పది లక్షల బ్యాగ్ని తీసుకుని, పారిపోయేందుకు ప్రయత్నించాడు. కండక్టర్ అతడ్ని ఆపేందుకు ప్రయత్నించగా, ఆ దుండగుడు తోసేశాడు.
ఇంతలో శివ తన కళ్లను తుడుచుకొని, నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ నిందితుడు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేయగా.. ప్రాణభయంతో శివ వెనక్కు తగ్గాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
కట్టుదిట్టమైన భద్రత ఉన్న నగరం నడిబొడ్డులో.. అది కూడా పట్టపగలే ఈ చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.