తెలంగాణ గవర్నర్ తమిళిసై దాతృత్వంతో.. 100 మంది టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీబీని అంతం చేయటానికి సమాజంలోని అన్ని వర్గాల వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 28 వేల మంది టీబీ రోగులున్నారన్నారు.
వీరిలో 25 వేల మంది టీబీ రోగులను దత్తత తీసుకోవాలన్నది తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు గవర్నర్. ఆ బాధ్యత టీబీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణపై ఇంకింత ఎక్కువుందన్నారు. 2025 కల్లా మన దేశాన్ని టీబీ ముక్త్ భారత్ గా చేయాలన్నారు.
ఈ సందర్భంగా 100 మంది పేద టీబీ రోగులను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విచక్షణ గ్రాంట్ల నిధుల నుంచి రూ.15 వేలు విడుదల చేస్తున్నట్లు ఆమె చెప్పారు. వాళ్లకు 6 నెలలు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తామని వెల్లడించారు.
అలాగే రాజ్ భవన్ ఉద్యోగులు, అధికారులు మరో 10 మంది టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. ఇంకింత మందిని దత్తత తీసుకునేందుకు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.