తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,443 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 166 మందికి పాజిటివ్ తేలింది. వీటితో కలిపి మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. ఇక రాష్ట్రంలో కరోనా కారణంగా నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1639కి పెరిగింది.
కరోనా బారి నుంచి తాజాగా 149 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీలు 2,95,970కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,963 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 88,83,295 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.