బాలాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాది ఒమర్ లో డెగావత్ పవన్ అనే 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. అర్థరాత్రి వాష్ రూమ్ కి అని ఇంట్లో నుండి బయటికి వచ్చిన పవన్ ని అక్కడే కాచుకొని ఉన్న ఇద్దరు వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా పొడిచారు.
పవన్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకి వచ్చి చూసేలోపు దుండగులు పారిపోయారు. తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. చేతికి అందొచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి పవన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.
మృతుడు పవన్ స్వస్థలం అమన్ గల్ కే స్లి తండా అని, స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా పవన్ కుటుంబ సభ్యులతో బాలాపూర్ వాది ఒమర్ లో నివాసం ఉంటున్నాడు.