తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 28,791 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 214 మందిలో పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 2,92,835కి చేరింది. అటు నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వీటతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,586కి పెరిగింది.కరోనాబారి నుంచి నిన్న 351 మంది డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా మొత్తం డిశ్చార్జీలు 2,87,468కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,781 ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 76.02 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.