ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు ముఖ్యంమత్రి కెసిఆర్. మొత్తం ఇప్పటివరకు 700 మందికి పైగా కరోనా అనుమానితులను పరీక్షా చేశామన్నారు.ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య మొత్తం వస్తోందని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారని, కరీంనగర్ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదన్నారు. 11 వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని, 5,274 నిఘా బృందాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై 14 రోజుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్పోస్ట్లు, 78 జాయింట్ టీమ్లను ఏర్పాటుచేశామని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు ఐదుగురితో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు.