ఉత్తరకాశీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి చార్ ధామ్ యాత్రకు యాత్రికులతో వెళ్తున్న ఉత్తరాఖండ్ లో ఒక్కసారిగా అదుపుతప్పి 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, ఒక హెల్పర్, మరో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటి ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 17 మృతదేహలను బయటకు తీసినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అదే విధంగా చనిపోయిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పన ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు.
కేంద్ర మంత్రులు.. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడిన సీఎం పుష్కర్.. గాయలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుంటుంబాలకు సంతాపం తెలిపారు సీఎం. మృతులంతా మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా అదికారులు గుర్తించారు.