లైబీరియాలో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందారు. ఆ దేశ రాజధాని మన్రోవియాలో ఓపెన్-ఎయిర్ పెంటెకోస్టల్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కొంత మంది దుండగులు భక్తుల దగ్గర దోపిడడీకి పాల్పడుతున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది.
ఎక్కువ మంది ఉండటంతో దోపీడి చేయడానికి కొంత మంది పాల్పడ్డారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి చాలా మంది నేలపై పడిపోయారు. వారిపై నుంచి తొక్కుకుంటూ పోవడం వలన 29 మంది చనిపోయారని లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి చెప్పారు.
చాలా మందికి తీవ్రగాయలయ్యాని.. కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జోగోస్ అని పిలిచే లైబీరియన్ స్ట్రీట్ గ్యాంగ్ల బ్యాండ్లు కొడవళ్లు, ఆయుధాలతో తరచూ దోపిడీలకు పాల్పడుతుంటాయి. గాయాలైన వారికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.