ఉత్తర్ ప్రదేశ్లోని భదోహిలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు నిర్వహిస్తుండగా మండపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అమ్మవారికి హారతి ఇస్తుండగా ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరారు. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను అదుపుచేశారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ తెలిపారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.