మేడ్చల్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాబు కూడ ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జాతీయ రహదారి అత్వెలి గ్రామ రేకుల బావివద్ద తూప్రాన్ నుండి నగరాని వస్తున్న టాటా ఏస్ AP 28 TV 5762 వాహనాన్ని బైక్ TS 36 H 9497 ను రాంగ్ రూట్ లో కొంపల్లి నుండి వస్తున్న కారు AP 11Ac 4902 ఢీ కొట్టగా 3 ముగ్గురు మృతి చెందారు.
మృతుల్లో ఒక మహిళ ఒక బాబు కూడ ఉన్నారు. స్దానికుల సమాచారం తో ప్రమాద స్థలం కు చేరుకొని గాయపడిన వారిన ఆసుపత్రి కి తరలించారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.