• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » దురాచారానికి సమాధి.. కుల వివక్షకు ‘వెలి’ !

దురాచారానికి సమాధి.. కుల వివక్షకు ‘వెలి’ !

Last Updated: January 3, 2023 at 4:49 pm

దురాచారానికి ‘సమాధి’ కట్టి.. కుల వివక్షను ‘వెలి’ వేశారక్కడ ! సమాజానికి పట్టిన ‘కుల గజ్జి’ కి పాతర వేశారక్కడ ! తమిళనాడులో జరిగిన ఓ ఉదంతం.. అద్భుత ఘట్టానికి తెర తీసింది. జనవరి 1 వైకుంఠ ఏకాదశి నాడు వరదరాజ పెరుమాళ్ ఆలయం కనీవినీ ఎరుగని దృశ్యాన్ని చూసి పులకించిపోయింది. ఒకటా.. రెండా? 200 సంవత్సరాలుగా ఎన్నడూ ఎరుగని అపురూప ఘట్టం ఆనాడు ఆవిష్కృతమైంది. ఈ రాష్ట్రం లోని కాళ్ళకురిచ్చి పరిధిలోగల ఎడుతవైనాథం గ్రామప్రజలు నిజంగా తమకు కలిగిన అనుభవానికి ఆనందంతో మైమరచిపోయారు. ఈ గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితులంతా ఇది కలా.. నిజమా అని ఆశ్చర్యపోయారు. ఇందుకు కారణం ఈ ఆలయ ప్రవేశానికి తమకు అనుమతి లభించడమే..

Dalits Enter 200 Year Old Temple: తొలిసారి.. 200 ఏళ్లనాటి పురాతన ఆలయంలోకి ప్రవేశించిన దళితులు! - SumanTV

దాదాపు రెండు శతాబ్దాలుగా వరదరాజ పెరుమాళ్ ఆలయంలో దళితులకు ప్రవేశం లేదు.. నిమ్న జాతులవారికి ఈ ఆలయంలో ప్రవేశించే అర్హత లేదని అగ్రవర్ణాలు నిషేధిస్తూ వచ్చాయి. ఇది ఆచారమని, దళితులు ప్రవేశిస్తే ఆలయం అపవిత్రమై పోతుందని వారు కనీసం ఈ గుడి వద్దకు రావడంపై కూడా ఆంక్షలు విధించారు. 2008 నుంచి ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. పైగా ఆలయ ఉత్సవాల్లో వేటి లోనూ దళితులు పాల్గొనే వీల్లేదు కూడా.

. కానీ ఈ కుల వివక్ష నశించాలని, భక్తితో తాము కూడా ఈ ఆలయంలో ప్రవేశించి భగవంతుడిని ఆరాధించేందుకు అనుమతించాలని వీరు చాలాకాలంగా అధికారులను కోరుతూ వచ్చారు. ఈ గుడి ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉందని ఇన్నాళ్లూ వీరు భావిస్తూ వచ్చారు. చివరకు ఇది ప్రభుత్వ దేవాదాయ శాఖ కింద ఉన్నట్టు తెలుసుకుని తమ అభ్యర్థనతో ఒత్తిడి పెంచారు.

ఇటీవల జిల్లా కలెక్టర్ ను కలిసి తమ విజ్ఞప్తిని ఆయన ముందు ఉంచారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారు. సంబంధిత చట్టాల కింద దళితులపై ఇలాంటి నిషేధం కూడదన్నారు. అగ్రవర్ణ పెద్దలతో కలిసి నిర్వహించిన సమావేశంలో అంతా దీనికి ఆమోద ముద్ర వేశారు. చివరకు 400 మంది పోలీసుల పటిష్ట భద్రత మధ్య సుమారు 300 మంది దళితులు ఈ నెల 1 న ఈ ఆలయ ప్రవేశం చేశారు. రెండు శతాబ్దాల తరువాత మొట్ట మొదటిసారిగా వీరు వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రార్ధనలు, పూజలు చేయడం విశేషం.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap