ప్రమాదకర రీతిలో బైక్ పై విన్యాసాలు చేసిన ఆకతాయిలపై పోలీసులు కేసు నమోదుచేసారు. నిబంధనలకు నీళ్ళొదిలి కనీస ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా విచ్చల విడిగా బైక్ రైడ్ చేసిన యువకులకు పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు.సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలో చోటుచేసుకుంది.
కొందరు యువకులు బైక్పై స్టంట్లు చేస్తూ.. రహదారిపై వీరంగం సృష్టించారు. మూడు ద్విచక్రవాహనాలపై 14 మంది యువకులు ప్రమాదకరంగా ప్రయాణించారు. ఒక ద్విచక్ర వాహనంపై ఏకంగా ఆరుగురు కూర్చుని స్టంట్లు చేశారు. మరో రెండు బైకులపై నలుగురు చొప్పున కూర్చున్నారు. వీరంతా దారిపొడవునా అరుస్తూ.. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. ఈ ఘటనను దారిన పోయేవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ అయ్యి.. పోలీసుల దృష్టికి చేరింది.
వీడియోలు, ఫొటోలు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకులను పట్టుకుని మూడు బైక్లను సీజ్ చేశారు. ఘటనపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి అఖిలేష్ కుమార్ తెలిపారు.
UP | In a viral video, 14 people were seen riding 3 bikes – 6 on one and 4 each on 2 two others – in the Deorania PS area of Bareilly.
SSP Bareilly Akhilesh Kumar Chaurasia says, "Once the information was received, the bikes were seized. Further action is being taken." (10.01) pic.twitter.com/APBbNs4kVi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 11, 2023