తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఫోర్త్వేవ్ భయం పట్టుకుంది. రోజురోజుకి పెరుగుతున్నకేసులను చూస్తుంటే నిజంగానే ఫోర్త్ వేవ్ వచ్చేసినట్లు అనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 477 కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి తో పోలిస్తే ఈరోజు కొత్తగా 43 కేసులు పెరిగాయి.
అయితే మొదటి వేవ్ లో లాగా ఎవరూ కూడా కరోనా సోకి మరణించకపోవడం అనే విషయం కాస్త ఊరటనిస్తుంది. గత 24 గంటల్లో 279 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,960 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 258, రంగారెడ్డిలో 107 కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.99 శాతం ఉండగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.27.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/AH3rym51xd— IPRDepartment (@IPRTelangana) June 27, 2022
Advertisements