భారతీయులు ఎక్కడున్నా ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఈమధ్య శిరీష బండ్ల స్పేస్ యాత్ర చేసి ఎంతో గర్వపడేలా చేసింది. తాజాగా భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గుర్తింపు లభించింది.
యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు చోటు దక్కించుకున్నారు. వందలోపు స్థానాల్లో ఐదుగురు నిలిచారు.
ఐదుగురిలో ముందుగా 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులతో అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 16వ స్థానంలో నిలిచారు. ఆమె తర్వాత సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. 1 బిలియన్ డాలర్ల ఆస్తులతో 26వ స్థానం దక్కించుకున్నారు.
925 మిలియన్ డాలర్లతో నేహా నార్ఖడే 29వ స్థానంలో, 750 మిలియన్లతో రేష్మా శెట్టి 39వ ప్లేస్ లో నిలవగా… పెప్సికో సంస్థ సీఈఓ ఇంద్ర నూయికి.. 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో 91వ స్థానం దక్కింది.