• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » కుప్ప కూలిన విమానంలో అయిదుగురు భారతీయులు

కుప్ప కూలిన విమానంలో అయిదుగురు భారతీయులు

Last Updated: January 15, 2023 at 2:21 pm

నేపాల్ లోని పొఖారా ఎయిర్ పోర్టు వద్ద కుప్ప కూలిన యతి విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో 32 మంది మృతదేహాలను కనుగొన్నారు. ఖాట్మండు నుంచి సుమారు 72 మందితో పొఖారా వెళ్తున్న ఈ విమానం ఇక్కడి రన్ వే వద్ద ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. మృతుల్లో అయిదుగురు భారతీయులున్నట్టు తెలుస్తోంది. ఇంకా 53 మంది నేపాలీలు, నలుగురు రష్యన్లు, ఓ ఐరిష్, ఇద్దరు కొరియన్లు,, ఇద్దరు పిల్లలు, అర్జెంటీనా, ఫ్రాన్స్ కు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఈ ఘోర దుర్ఘటనలో మృతి చెందినట్టు భావిస్తున్నామని ఎయిర్ పోర్ట్ అథారిటీకి చెందిన ఓ అధికార ప్రతినిధి తెలిపారు.

5 Indians among 72 aboard Nepal plane that crashed; 40 bodies recovered | World News - Hindustan Times

ఘటన జరిగిన ప్రాంతం వద్ద పెద్దఎత్తున మంటలు రేగి. పొగలు వస్తున్న కారణంగా సహాయక చర్యలు నిర్వహించడం కష్టతరంగా ఉందని ఆయన చెప్పారు. విమాన శిథిలాల కింద ఇంకా మృతులు ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహల్ ప్రచండ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. సహాయకచర్యలను సమీక్షించారు. పొఖారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ యతి ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన సుమారు 20 నిముషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ఇప్పుడే చెప్పలేమని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు.

నిజానికి నేపాల్ లో విమాన ప్రయాణాల పట్ల, సేఫ్టీ పట్ల యూరోపియన్ యూనియన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి విమాన సిబ్బందికి తగినంత శిక్షణ లేదని పేర్కొంటూ .. 2013 లోనే ఫ్లైట్ సేఫ్టీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. నేపాల్ నుంచి వచ్చే అన్ని విమానాలు తమ గగనతల పరిధిలోకి రాకుండా బ్యాన్ విధించింది. లోగడ నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదాల్లో వందలాది మంది దుర్మరణం పాలయ్యారు. గత ఏడాది మే 22 న నేపాలీ క్యారియర్ టాటా ఎయిర్ లైన్స్ వారి విమానం కూలిపోగా నలుగురు భారతీయులతో బాటు 16 మంది నేపాలీలు మరణించారు.

Primary Sidebar

తాజా వార్తలు

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

మాక్ డ్రిల్.. అట..! ప్రమాదమా? కవరింగా? 

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై ఈనెల 6న హైకోర్టు తీర్పు

విశ్వనాథ్ సినిమా షూట్ లో ఖాకీ డ్రెస్ ఎందుకు వేస్తారు…?

వెంకటేష్ కు రాజేంద్ర ప్రసాద్ మధ్య గొడవకు ఆ సినిమానే కారణమా…?

ఈయన ఒక ఎంపీ.. ఖర్మరా బాబు!!

తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు!

ఆ కేసులో తీర్పు కోసం ఎంపీ ఎదురుచూపులు!

బిహార్ నుంచి భీమదేవరపల్లికి నడుచుకుంటూ వచ్చేసిన…గర్భిణి.!

ఈ సినిమాల్లో బ్రాహ్మీకి వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్

విశ్వనాథ్ చివరి కోరిక తీరలేదా…?

ఫిల్మ్ నగర్

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

పవన్ ఫస్ట్ మూవీ..కళాతపస్వి డైరెక్షన్లోనా ..!?

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు...!

తెలుగు సినీపరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు…!

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి విశ్వనాథ్ అంత్యక్రియలు

అందమైన భామలు అంతులేని భయాలు...!

అందమైన భామలు అంతులేని భయాలు…!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

పవన్ ఫ్యాన్సా మజాకానా!

'మైఖేల్' మూవీ రివ్యూ

‘మైఖేల్’ మూవీ రివ్యూ

''లక్‌'' వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

”లక్‌” వచ్చి 14 ఏళ్లు అయ్యింది: శ్రుతి హాసన్!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

నేడు షూటింగ్స్ బంద్.. కళాతపస్వికి నివాళులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap