ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలోనే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండో ప్రాణం గాల్లో కలిసిపోయింది. చిన్న సర్జరీ అని చెప్పి..చివరికి ప్రాణాలు తీశారంటూ మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్ తో పాటు ఆసుపత్రి యాజమాన్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత 13 రోజుల క్రితం హెర్నియా ఆపరేషన్ కోసం ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చేరిన రవీందర్ అనే వ్యక్తికి చిన్న సర్జరీ చేయాలని చెప్పి జాయిన్ చేసుకుని చివరికి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్జరీ సమయంలో మత్తుమందు డోస్ ఎక్కువగా కావడంతో మత్తు మందు పడలేదని.. ఐసీయూలో వెంటలేటర్ పై పెట్టాలని చెప్పి లక్షల రూపాయల డబ్బులు దండుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడని, బాడీని తీసుకొని వెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు మృతుని బంధువులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రవీందర్ చనిపోయాడని ఆరోపిస్తూ.. కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్ కృష్ణా చౌదరితో పాటు ఆసుపత్రి యాజమాన్యం పై పోలీసులు 304A కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఆరోపణలు రావడంతో రెండోసారి.