ఓవైపు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే… ఎన్నికలు, ఎన్నికల ర్యాలీలు అవసరమా అంటూ కోర్టులు చివాట్లు పెడుతున్న ఎన్నికలు ఆగటం లేదు. ఎన్నికల సంఘాలు ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపుతున్నాయి. వరంగల్ లో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలున్న నేపథ్యంలో డా.కోట శ్యాంకుమార్ వినూత్న ప్రచారం చేశాడు.
నగరం లో పరిస్థితులు బాగా లేవని… ఓటింగ్ కోసం వస్తే కరోనా ఖతం చేస్తుందని, జనం ఓట్లేసేందుకు రాకండి అంటూ వరంగల్ ఎంజీఎం ముందున్న గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపాడు. రాజకీయ నాయకులకు ఓట్లు మాత్రమే కావాలి ప్రజల ప్రాణాలు ఏమైపోయినా వాళ్లకు అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి పరిస్థితులు అస్సలు బాగాలేవు ఎవరు ఓటింగ్లో పాల్గొన వద్దు… 10 లక్షల మంది చనిపోయిన ప్రభుత్వానికి పోయేదేమీ లేదు కానీ మీ కుటుంబంలో ఒక్కరిని పోగొట్టుకున్నా మీరు భరించలేరు కాబట్టి ఎవ్వరు కూడా ఓటింగ్ లో పాల్గొనకండి అంటూ ఆ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మీ ప్రాణాలకు మీరే రక్ష ..ఓటు అడిగిన ఎనా కొడుకు కూడా మీకు వైద్యం చేయించడు. భార్య పిల్లలను ,తల్లిదండ్రులను వదిలేసి మా ప్రాణాలు కూడా లెక్కచేయకుండా కరోనాతో పోరాడుతుంటే… మీ స్వార్థం కోసం ఎలక్షన్స్ పెట్టి ఎంతమందిని కరోనాకు బలితీసుకుంటారు అని కోట శ్యామ్ కుమార్ ప్రశ్నించారు.
ఓటుకు రాకు – కరోనాతో ఖతమై పోకు..
నోటు మాటున ఓటు వేయకు ….కరోనా కాటుకు బలవ్వకు…
ఓటుకు నోటు ఉచితం.. ఓటు వేయడానికి వస్తే కరోనా ఉచితం…
ఓటు వేయడానికి దూరంగా ఉండండి.. కరోనా రోగాన్ని దరిచేరనివ్వకండి
అంటూ నినాదాలు చేశారు…