బైక్ను జాగ్రత్తగా నడపమని చెప్పినందుకు ఓ వ్యక్తి పోలీసుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కానిస్టేబుల్ చేతిలోని లాఠీని లాక్కొని అతడిని కొట్టాడు. పోలీసు తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటపడి మరీ ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. మరో ఆశ్చర్యకర విషయమేమిటంటే.. పోలీసుపై దాడి చేసేప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని వెంకటేష్ నగర్ ప్రాంతంలో శుక్రవారం ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి బైక్లు ఢీ కొన్నాయి. దీంతో పోలీసు కానిస్టేబుల్ ప్రకాష్ జైస్వాల్ వారికి జాగ్రత్తగా బండి నడపమని చెప్పారు. ఇలా చెప్పినందుకు వారిలో ఒకరైనా దినేష్ ప్రజాపతి(25) అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్పై దాడి చేశాడు. యూనిఫాంలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ జై ప్రకాష్ జైస్వాల్ చేతిలోని సర్వీస్ లాఠీని లాక్కొని మరీ విపరీతంగా కొట్టాడు.
అయితే, కర్రతో పదే పదే కొట్టడంతో ఆ దెబ్బలకు జై ప్రకాష్ అక్కడ నుంచి పారిపోయాడు. కానీ, వెంటపడి మరీ కర్రతో దినేష్ కొడుతూనే ఉన్నాడు. ఈ సమయంలో అక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఎవరూ కూడా అతడిని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఈ దాడిలో కానిస్టేబుల్ జైస్వాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా స్పందించారు. ఆ సమయంలో దినేష్ తాగి ఉన్నాడని కూడా డీసీజీ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా దినేష్ ప్రజాపతిని ఐసీపీ సెక్షన్ 307, ఇతర సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. అలాగే దినేష్కి నేర చరిత్ర ఉందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq
— Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022
Advertisements