ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నందుకు నోటీసులు జారీ చేసింది. రూ.163.62 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.
పది రోజుల్లో ఈ మొత్తం చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ నోటీసుల్లో స్పష్టం చేసింది. రూ.163,6188,265 చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని వెల్లడించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రకటనలను వాడుకోవడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలకు ఆదేశించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ చెల్లించాల్సిన రూ.163 కోట్లలో రూ.99 కోట్ల 31 లక్షలు 2017 మార్చి 31 వరకు అడ్వర్టైజ్ మెంట్ల కోసం ఉపయోగించగా.. మిగిలిన రూ.64 కోట్ల 31 లక్షల్ని వడ్డీ రూపంలో చెల్లించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం వెల్లడించింది.