కూకట్ పల్లి జేఎన్టీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోని రిజిస్ట్రార్ కార్యాలయం ముందు కూర్చుని భైఠాయించి ధర్నా చేపట్టారు. పీజీ ఈసెట్, టీఎస్ ఎంసెట్ 2023 కన్వీనర్లుగా జేఎన్టీయూ ప్రొఫెసర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రికి కంప్లైంట్ చేశారు.
జేఏసీ పేరుతో యూనివర్సిటీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీతో సంబంధంలేని వ్యక్తులు జేఏసీ పేరుతో కంప్లైంట్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నించారు.
ఈ మేరకు ఇంఛార్జ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2023 పీజీ ఈ సెట్ టీఎస్ ఎంసెట్ కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి జేఎన్టీయూ ప్రొఫెసర్లను నియమించింది. అయితే ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్లు వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంతో వారికి సంబంధం లేకపోయినా వ్యక్తిగత కారణాలతో కుట్రలు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీతో సంబంధం లేని వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.