• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం..7 గురి మృతి!

ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం..7 గురి మృతి!

Last Updated: February 9, 2023 at 1:13 pm

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట మండలంలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌ శుభ్రం చేయడానికి లోపలకు దిగిన కార్మికులు ఒక్కొక్కరుగా మృతి చెందారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ట్యాంకుల్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.

ఉదయం ఆరుగంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్లు శుభ్రం చేయడానికి కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణకు వచ్చారు. పని ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. పాడేరుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఆయిల్ ట్యాంకర్‌ శుభ్రం చేస్తుండగా ఊపిరి అందకపోవడంతో లోపలకు జారిపోయాడు. అతడిని రక్షించేందుకు వచ్చిన నరసింహ, సాగర్‌‌లు కూడా అపస్మారక స్థితిలోకి చేరడంతో మిగిలిన వారు వారిని రక్షించేందుకు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారు.

మృతులను రామారావు, ప్రసాద్ జగదీష్, వెచ్చంగి సాగర్, బొంజుబాబు, వెచ్చింగి కృష్ణ, వెచ్చంగి నరసింహలుగా గుర్తించారు.మృతుల్లో ఐదుగురిది పాడేరుగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులను పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరికి ఇటీవల వివాహం జరిగినట్లు సహచరులు చెబుతున్నారు.

కంపెనీ యాజమాన్యం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు భారీ పరిణామంలో ఉన్న వంట నూనెల ట్యాంకర్లను శుభ్రం చేసే పనుల్ని పాడేరు, పులిమేరులకు చెందిన వారికి అప్పగించారు. ఒక్కో ట్యాంకర్‌ శుభ్రం చేయడానికి నిర్ణీత మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లలో విషవాయువులు పేరుకు పోవడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ట్యాంకర్లలో ఆక్సిజన్ పరిణామాన్ని గుర్తించకుండా కార్మికుండా కార్మికుల్ని పనిలోకి పురమాయించడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాద స్థలానికి పెద్దాపురం పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో జగదీష్‌, ప్రసాద్‌ పులిమేరు గ్రామస్తులుగా గుర్తించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ప్రైవేటు బస్సులకు ధీటుగా టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు

సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలు.. ఉద్దవ్ ఠాక్రే హెచ్చరికలు…!

మీ అందరి ఆశీర్వాదాలు కావాలి: మనోజ్‌!

జర పట్టించుకోండి సారూ.. డీజీపీకి జనగాం వాసి ట్వీట్

విమోచనం మంటలు.. అమిత్ షా కు కేటీఆర్ కౌంటర్

పుదుచ్చేరిలో బీజేపీ నేత దారుణ హత్య

నిద్రలేమితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే!

వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

అమెరికాకు మరో హెచ్చరిక..నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం!

తృణమూల్ కాంగ్రెస్ షాకింగ్ నిర్ణయం

‘బీజేపీకి జై కొట్టకపోతే.. జైలుకు పోతావ్’.. ప్రతిపక్షాలకు బెదిరింపులు

ఎంపీ, ఎమ్మెల్యేలతో వేదిక పంచుకున్న అత్యాచార నిందితుడు..మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత!

ఫిల్మ్ నగర్

manchu manoj skips manchu vishnu topic infront of media

మీ అందరి ఆశీర్వాదాలు కావాలి: మనోజ్‌!

chiranjivi birthday wishes to ram charan

నాన్నా రామ్ చరణ్.. నిన్ను చూసి గర్విస్తున్నాను!

ramcharan rc15 movie title announced as game changer

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

malayalam actor former loksabha mp innocent passed away

ప్రముఖ నటుడి కన్నుమూత!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap