వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచుతోంది. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న వారిని భారీ బందోబస్తు నడుమ ఏపీ పోలీసులు కడప జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. వీరిని సీబీఐ కోర్టులో 10:30 గంటలకు హాజరు పరచనున్నారు.
అయితే వివేకా హత్య కేసులో కడప జైల్లో ఏ2 గా సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గా ఉమా శంకర్ రెడ్డి, ఏ5గా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇక ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఏ4గా ఉన్న అప్రూవర్ దస్తగిరిలు బెయిల్పై బయటికొచ్చారు. తిరిగి విచారణ సీబీఐ చేపట్టిన క్రమంలో నిందితులందర్ని సీబీఐ కోర్టు మళ్లీ విచారిస్తోంది. అయితే ఏ1, ఏ2 లు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు.
మరో వైపు సీబీఐ విచారణలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలనున్నాయని, నిజాలు బయట పడే రోజు దగ్గర పడిందన్నారు. ఇంత కాలం దస్తగిరి చెప్పింది అబద్దమని కొందరు అన్నారని.. తాను చెప్పిన నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయని బాంబు పేల్చారు దస్తగిరి.
అయితే ఈ మధ్య కాలంలో కొందరిని సీబీఐ అధికారులు విచారించారంటే సమాచారం ఉంటేనే కాదా విచారణకు పిలిచి ఉంటారని దస్తగిరి అన్నారు. రాష్ట్రంలో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు కేసు బదిలీ చేయడం మంచిదేనన్నారు.
మరో వైపు ఏపీ సీఎస్ వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటబెట్టకొని మరీ తాడేపల్లికి సీఎస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేస్తోంది. మరి ఈ రోజు సీబీఐ కోర్టులో నిందితులు ఏం మాట్లాడుతారన్న దానిపై కేసు కీలక మలుపు తిరిగే అవకాశముంది.