• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » భారీ బందోబస్తు మధ్య  హైదరాబాద్ కు వివేకా కేసులో నిందితులు

భారీ బందోబస్తు మధ్య  హైదరాబాద్ కు వివేకా కేసులో నిందితులు

Last Updated: February 10, 2023 at 9:48 am

వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచుతోంది. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న వారిని భారీ బందోబస్తు నడుమ ఏపీ పోలీసులు కడప జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. వీరిని సీబీఐ కోర్టులో 10:30 గంటలకు హాజరు పరచనున్నారు.

అయితే వివేకా హత్య కేసులో కడప జైల్లో ఏ2 గా సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గా ఉమా శంకర్ రెడ్డి, ఏ5గా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇక ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఏ4గా ఉన్న అప్రూవర్ దస్తగిరిలు బెయిల్‌పై బయటికొచ్చారు. తిరిగి విచారణ సీబీఐ చేపట్టిన క్రమంలో నిందితులందర్ని సీబీఐ కోర్టు మళ్లీ విచారిస్తోంది. అయితే ఏ1, ఏ2 లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 

మరో వైపు సీబీఐ విచారణలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలనున్నాయని, నిజాలు బయట పడే రోజు దగ్గర పడిందన్నారు. ఇంత కాలం దస్తగిరి చెప్పింది అబద్దమని కొందరు అన్నారని.. తాను చెప్పిన నిజాలు ఏమిటో ఇక తెలుస్తాయని బాంబు పేల్చారు దస్తగిరి.

 

అయితే ఈ మధ్య కాలంలో కొందరిని సీబీఐ అధికారులు విచారించారంటే సమాచారం ఉంటేనే కాదా విచారణకు పిలిచి ఉంటారని దస్తగిరి అన్నారు. రాష్ట్రంలో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు కేసు బదిలీ చేయడం మంచిదేనన్నారు.

 

మరో వైపు ఏపీ సీఎస్ వ్యవహార శైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటబెట్టకొని మరీ తాడేపల్లికి సీఎస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేస్తోంది. మరి ఈ రోజు సీబీఐ కోర్టులో నిందితులు ఏం మాట్లాడుతారన్న దానిపై కేసు కీలక మలుపు తిరిగే అవకాశముంది.

Primary Sidebar

తాజా వార్తలు

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ..!

చైనాలో మరణ మృదంగానికి జిన్ పింగ్ వైఫల్యమే కారణమా..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

వాడిపోయిన ఆకుకూరలకు రసాయనాల రెన్యువల్…వీడియో వైరల్… !

బీజేపీ, జనసేన మధ్య దోస్తీ ముగిసినట్టేనా… !

టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ… బండి సంజయ్ కు సిట్ నోటీసులు..!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

సత్య హరిశ్చంద్రుడికి మెహుల్ చోక్సీ మరో బంధువు… మోడీపై కేటీఆర్ సెటైర్లు..!

నితిన్ గడ్కరీకి మళ్ళీ బెదిరింపు కాల్స్ !

క్షణక్షణం ఉత్కంఠ.. ఇంకా ఈడీ ఆఫీస్ లోనే కవిత

ఫిల్మ్ నగర్

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

nivedha pethuraj comments on viswaksen he will become a successful director

విశ్వక్‌ ఒక లోకేశ్‌ కనగరాజ్‌ లా అవుతాడు!

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap