ముఖ్యమంత్రి, మంత్రులు కరోనా పై మాట్లాడిన మాటలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ఈసీ పైనా విమర్శలు చేస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుల ప్రాధాన్యం పై బహిరంగ చర్చకు నేను సిద్ధం, వైకాపా సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. వైకాపా లో ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో బహిర్గతం చేస్తా.. చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ చేస్తున్నాఅంటూ హెచ్చరించారు. ఎన్నికలకు ఆర్ధిక సంఘం నిధులకు సంబంధం లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికైనా సమాజం గురించి తెలుసుకుని వ్యవహారశైలి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రపంచం మొత్తం కరోనాపై అప్రమత్తత గురించి మాట్లాడుతుంటే జగన్ ఒక్కరే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. కరోనా ను పారద్రోలి ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధమవుదామన్నారు.