టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
సోమవారం టెక్కలిలో నిర్వహించిన లోకేశ్ జన్మదిన వేడుకల్లో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.
కొంతమంది మంత్రులు సీఎం చంచాగాళ్లలా పనిచేస్తున్నారని విమర్శించారు. ”అసలు డీజీపీ ఐపీఎస్ చదివాడా?.. లేక దొంగ సర్టిఫికెట్లుతో వచ్చాడా” అంటూ మండిపడ్డారు.
లోకేష్ పాదయాత్ర ప్రకటించినప్పటి నుంచి వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో చాలా మంది సీఎంలు పనిచేశారని… జగన్ లాంటి సైకో ముఖ్యమంత్రిని చూడలేదని అన్నారు. పిచ్చి సైకో పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు