టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి తెలియని వారు ఉండరు. సీరియస్, కామెడీ పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్గా ఉంటూ తనని ట్రోల్స్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా..తనపై అసత్య ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి హేమ.
సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, అంతేకాకుండా తన భర్తతో ఉన్న ఫొటోలను ఫేక్ తంబ్ నేల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీలు, సినిమా నటులు చనిపోయారని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.