రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. అయితే రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఆమె ఫ్యాన్స్ ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోను షేర్ చేస్తూ.. ‘శ్రేయోభిలాషులారా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను గత కొన్నేళ్లుగా గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఈ క్రమంలోనే వాటిని ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకునేందుకు, బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను’.
‘పోషకాహారం కూడా తీసుకుంటున్నా. నేను మాత్రమే కాదు నాలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు బలంగా నిలబడాలని, వారిలో సానుకూల దృక్పథం నింపేందుకే ఇప్పుడు ఈ పోస్ట్ పెడుతున్నాను. ఎలాంటి కఠిన పరిస్థితులు ఉన్నాసరే ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఓ రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితంతో పాటు మనపై మనకు నమ్మకం ఉండాలి’.. అంటూ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త విని ఆమె ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు షాక్ కి గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కాగా హీరోయిన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా రేణు గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram