ఆప్ఘనిస్థాన్ను వశం చేసుకున్నామని సంబంరపడుతున్న తాలిబాన్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని పలు చోట్ల స్థానిక తాలిబాన్ వ్యతిరేక సాయుధ దళాలు వారిపై ఎదురుదాడిని ప్రారంభించాయి. ఈ మేరకు తాలిబాన్లతో పోరాడి బగ్లాన్ ప్రావిన్స్లోని బాను, పోల్ ఈ హెసార్, దె సలహ్ ఇన్ జిల్లాలను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన జిల్లాలను కూడా స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. వీరి ప్రతిఘటనలో కనీసం 60 మంది తాలిబాన్కు చెందిన సైనికులు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యూకేకు చెందిన పర్షియన్ టీవీ జర్నలిస్టు ఒకరు ట్వీట్టర్ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరో పోస్టులో ఆప్ఘాన్ జెండా ఎగరేస్తున్న స్థానిక దళాలు కనిపిస్తున్నాయి.
BREAKING:
An ex, Afgh government officials tell me that local resistances forces in Baghlan province have recaptured Banu and Pol-e-Hesar districts from the Taliban. They are advancing towards the Deh Salah district. About 60 Taliban fighters were killed or injured. pic.twitter.com/OX8CBUTcSO— Tajuden Soroush (@TajudenSoroush) August 20, 2021
Public’s Resistance Forces under Khair Muhammad Andarabi claim that they have captured Pol-e-Hesar, Deh Salah and Banu districts in #Baghlan and advancing towards other districts. They are saying that the Taliban did not act in the spirit of a general amnesty. #Taliban pic.twitter.com/AS8isXlwNC
— Aśvaka – آسواکا News Agency (@AsvakaNews) August 20, 2021
Advertisements
మరోవైపు తాలిబాన్లకు ఎదుర్కొనేందుకు పంజషిర్ లోయలో వారి వ్యతిరేక దళాలు పథకం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాలిబాన్లపై గెరిల్లా తరహా దాడులు చేయాలని భావిస్తున్నట్టుట్టుగా తెలుస్తోంది. అప్ఘాన్ ఉపాధ్యక్షుడు అలాగే తాలిబాన్ వ్యతిరేక పోరాట సంస్థ యోధుడు అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ నాయకత్వంలో ఈ సేనలు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రష్యా చెందిన ప్రభుత్వ ప్రతినిధి లావ్రోవ్ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. తాలిబాన్లు.. మొత్తం ఆప్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్లోని పంజషిర్ లోయ సైనిక బలగాలక అత్యంత సురక్షితమైనదని అంటున్నారు. ఆప్ఘనిస్థాన్ భూభాగంలో ఒక మూలన ఉండే ఈ ప్రదేశంలోకి శత్రువులు అంత సులువుగా ప్రవేశించలేరని చెప్తున్నారు. తాలిబాన్ వ్యతిరేక పోరాట సంస్థను నడిపిస్తున్న అహ్మద్ మసూద్ ఇప్పటికే..తమ పోరాటానికి అమెరికా సేన మద్దతు కూడా కోరినట్టుగా తెలుస్తోంది.