కర్ణాటక రాష్ట్రం కతీల్ పట్టణంలోని దుర్గా పరమేశ్వరి ఆలయంలో ప్రతి ఏడాది ఏప్రిల్లో జాతర నిర్వహిస్తుంటారు. అయితే, ఈ జాతరలో దుర్గాదేవి భక్తులు ‘అగ్ని ఖేళి’ ఆడడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆటలో భాగంగా రెండు వర్గాలుగా విడిపోయిన భక్తులు.. ఒకరిపై ఒకరు భగభగ మండే కాగడాలు విసురుకుంటారు.
కాషాయం దోతీలు కట్టుకుని, ఛాతిపై చొక్కాలు లేకుండానే భక్తులు ‘అగ్ని ఖేళి’ ఆడతారు. దుర్గాపరమేశ్వరి దేవి ఆరాధనలో భాగంగా.. ఆ దేవిని శాంతింపజేయడానికి భక్తులు ఇలా ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకుంటారు.
మంగుళూరు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు ఈ ఆటను ఆడుతుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వరుసగా ఎనిమిది రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా ‘అగ్ని ఖేలి’ ఆచారంగా నిర్వహిస్తుంటారు.
స్నేహితులు, తెలిసిన వారే అయినప్పటికీ శత్రువుల్లా బరిలోకి దిగుతారు. 20 మీటర్ల దూరం నుంచి 15 నిమిషాల పాటు ఒకరిపై ఒకరు నిప్పులు విసురుకుంటారు. ఈ ఆటలో గాయాలైన భక్తులు వైద్యం చేయించుకోరు.. గాయాలపై కుంకుమ నీళ్లు చల్లుతారు. ఇదే అక్కడి ఆచారంగా భావిస్తారు. ఈ అగ్ని ఖేళి ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Devotees hurled fire at each other as part of a fire ritual 'Thoothedhara' or ‘Agni Kheli’ to pay reverence to goddess Durga at Sri Durgaparameshwari temple in Kateel, Karnataka (22.04) pic.twitter.com/q4SHMFAGak
— ANI (@ANI) April 23, 2022
Advertisements