నిధులను విడుదల చేయాలని మలిదశ ఉద్యమం చేపట్టేందుకు అగ్రిగోల్డ్ బాధితులు సిద్ధమయ్యారు. గుంటూరులో బాధితుల విజ్ఞాపన దీక్షలను అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. భౌతిక దూరం పాటిస్తూ బాధితులు విజ్ఞాపన దీక్షలకు దిగారు. బడ్జెట్లో కేటాయించిన రూ.1,150 కోట్లు సత్వరమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. మొత్తం సొమ్ములో 50 శాతాన్ని తక్షణం చెల్లించాలని కోరారు. సమస్యను ఆరుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని నాగేశ్వరరావు తెలిపారు. సీఎంను కలిసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.