భారత్ జోడో యాత్ర త్వరలో తెలంగాణకు చేరనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో యాత్ర కోసం కాంగ్రెస్ 10 కమిటీలను వేసింది. కేసీ వేణు గోపాల్ హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన టీపీసీసీ ఈ మేరకు కమిటీలను ఏర్పాటు చేసింది.
అందులో అలంకరణ కమిటీ, ట్రాఫిక్ క్లియరెన్స్, పార్కింగ్ కమిటీ , మౌలిక వసతుల కమిటీ, ఫుడ్, వాటర్ మేనెజ్మెంట్ కమిటీ, మీడియా మేనెజ్మెంట్ కమిటీ, గార్బేజ్ కమిటీ, పబ్లిక్ మొబిలైజేషన్ కమిటీ, రూట్ కో ఆర్డినేషన్ కమిటీ, కల్చరల్ యాక్టీవిటీ కమిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి కమిటీలను నియమించింది.
భారత్ జోడో యాత్రపై టీపీసీసీ ముఖ్యనేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. యాత్రపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్పై పీసీసీ నేతలతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో భారత్ జోడోకు విస్తృతమైన ప్రచారం చేయాలని పీసీసీని ఆయన ఆదేశించారు. ప్రతీ గ్రామంలోనూ హోర్డింగులు ,స్కూళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
భారత్ జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలో ప్రవేశించబోతోంది. 23న సగం రోజు మాత్రమే ఆయన పాదయాత్ర చేయనున్నారు. 24, 25 రోజుల్లో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. మళ్లీ 26 నుంచి రాహుల్ యాత్ర పున: ప్రారంభం కానుంది..
రాష్ట్రంలో రాహుల్ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి మక్తల్లోకి పాదయాత్ర ఎంటర్ కానుంది.