• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కాంగ్రెస్ నేతలతో కొత్త ఇన్ ఛార్జ్ వరుస భేటీలు.. కారణమదేనా?

కాంగ్రెస్ నేతలతో కొత్త ఇన్ ఛార్జ్ వరుస భేటీలు.. కారణమదేనా?

Last Updated: January 11, 2023 at 8:50 pm

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కొత్త ఇన్ ఛార్జ్ మానిక్ రావు ఠాక్రే వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆయనకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో మానిక్ రావ్ పర్యటించనున్నారు. మొదటి రోజు నేతలతో తీరిక లేకుండా ఆయన వరుసగా సమావేశమయ్యారు. తొలుత రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరీలతో గంటపాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, నాయకుల తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో విడివిడిగా సమావేశయ్యారు.

వీరిద్దరి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు మానిక్ రావు. ఆ తర్వాత గీతారెడ్డి, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జానారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంతరావు, మహేశ్వర్ రెడ్డి సహా మరికొందరి నేతలతో ఆయన భేటీ అయ్యారు. అయితే కొందరి నాయకులతో మానిక్ రావు వేర్వేరుగా సమావేశమయ్యారు. సాయంత్రం వరకు నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన ఆయన.. సీనియర్ ఉపాధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతోనూ భేటీ అయ్యారు.

అలాగే మానిక్ రావ్ భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం. ఆ ఇద్దరు నాయకుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అందుబాటులో లేకపోగా.. వెంకటరెడ్డి మాత్రం ఊర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న మానిక్ రావు.. పార్టీ అనుబంధ కమిటీల చైర్మన్లతోనూ భేటీ కానున్నారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పక్కన పెట్టి అందరూ ఏకతాటిపై నిలిచి పార్టీ కోసం పని చేయాలని తనతో సమావేశమైన నాయకులకు మానిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేస్తున్నారు. పార్టీక్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap