గుంటూరు: తణుకు దగ్గర నత్త రామేశ్వరంలో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని తయారు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏకే ఆర్ట్స్ సంస్ధ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెలకు విగ్రహం తయారు చేసి నివాళులర్పించారు.
కోడెల విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విగ్రహాన్ని నరసరావుపేటలో ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. గతంలో ఇదే సంస్ధ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తారకరామాసాగర్లో వున్న 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేశారు.