కరోనా కట్టడి కోసం పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి సహాయనిధికి హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఏదైనా వ్విపత్కర పరిస్థితుల్లో హీరోలు తమ వంతుగా ముందుకు వస్తూ..2కోట్లు లేదా 5కోట్ల వరకు ఇవ్వడం మనం చూశాం కాని హీరో అక్షయ్ కుమార్ మాత్రం ఏకంగా 25కోట్ల విరాళం ప్రకటించడం సంచలనంగా మారింది. కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ అమలు అవుతోంది. అన్ని మూతపడటంతో సాధారణ ప్రజల నుంచి అంత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనాపై యుద్ధం చేస్తోన్న ప్రభుత్వానికి పలు కార్పోరేట్ సంస్థలతోపాటు సినీ తారలు తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అక్షయ్ కుమార్ ఎవ్వరు ఊహించని విధంగా 25కోట్ల విరాళం ప్రకటించాడు. ఆయన అంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడంతో అంత షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే ఇది నిజమా..?అంటూ నోరెళ్ళబెడుతున్నారు.
అక్షయ్ కుమార్ ప్రకటించిన విరాళంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తుండగా ఆయన భార్య మాత్రం మరోవిధంగా స్పందించింది. ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తన భర్త అక్షయ్ కుమార్ ప్రకటించిన విరాళంతో గర్వంగా ఉందని..అదే సమయంలో భారీ విరాళం ప్రకటించే ముందు ఓసారి ఆలోచించమని తన భర్తకు చెప్పినట్లు పేర్కొంది. కాని అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రకటించేశాడని చెప్పింది.
The man makes me proud. When I asked him if he was sure as it was such a massive amount and we needed to liquidate funds, he just said, ‘ I had nothing when I started and now that I am in this position, how can I hold back from doing whatever I can for those who have nothing.’ https://t.co/R9hEin8KF1
— Twinkle Khanna (@mrsfunnybones) March 28, 2020
అయితే తన ప్రశ్నకు అక్షయ్ కుమార్ చెప్పిన సమాధానం ఏంటో కుడా చెప్పెసింది ట్వింకిల్. తాను సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదని.. అలాంటిది నేడు ఇంత మంచి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి కారణం ఈ జనమేనని చెప్పారని చెప్పింది. వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు అది ప్రజలకు ఇవ్వాలని అందులో తన గొప్పెముందని ప్రశ్నించినట్లు చెప్పింది. వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరముందని చెప్పినట్లు అక్షయ్ చెప్పినట్లు చెప్పింది. నిజంగా అక్షయ్ ఈ విరాళంతో రీల్ హీరోనే కాదు రియల్ లైఫ్ లో కుడా హీరోనేనని ప్రూవ్ చేసుకున్నాడు.