భారత్ నుంచి చైనామల్టీనేషన్ కంపెనీ..అలీబాబా తట్టాబుట్టా సర్దేసింది. సదరు సంస్థకున్న షేర్లన్నీ పేటీఎం మాతృసంస్థైన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కు అమ్మినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం జరిగిన డీల్తో ఈ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించాయి.
అలీబాబాకు చెందిన 3.16 శాతం డైరెక్ట్ వాటాను బ్లాక్ డీల్లో దాదాపు 13,600 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలిపాయి డిసెంబర్ 2022 నాటికి అలీబాబా కంపెనీ పేటీఎమ్లో 6.26 శాతం ప్రత్యక్ష వాటాలను కలిగి ఉంది.
అందుకుగాను జనవరిలో 3.1 శాతం వాటాను విక్రయించగా మిగిలిన 3.16 శాతం కూడా విక్రయించింది.దీంతో చైనా సంస్థకున్న ఇండియాతో ఉన్న బిజినెస్ బంధాలన్నీ తెగిపోయాయి.
ఈ డీల్తో అలీబాబా కంపెనీ పూర్తిగా భారత్ నుంచి తరలివెళ్లనుంది. గతంలో కూడా జొమాటో, బిగ్బాస్కెట్లో తన వాటాలను అలీబాబా కంపెనీ విక్రయించింది. గత కొద్ది రోజులుగా పేటీఎం షేర్ల విలువ పెరుగుతూ వస్తోంది. రుణాలు, ఇతర కీలక చెల్లింపుల్లో వృద్ధిని కొనసాగిస్తోంది.