• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మున్సి’పల్స్‌’ పట్టేదెలా….?

Published on : October 22, 2019 at 5:09 pm

కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు. మున్సిపల్ ఎన్నికలపై ఎక్కువగా పట్టణ ప్రాంత ఓటర్ల ప్రభావం ఉంటుంది. సంక్షేమ పథకాల ప్రభావం కాస్త తక్కువనే చెప్పుకోవాలి. తెలంగాణ లోని మూడు ప్రధాన పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలపై మంచి ఫలితాలు సాధించాలి అని ఎత్తులు వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మోడీ హవా ఉంటుంది కాబట్టి బీజేపీ కూడా చెప్పుకొదగ్గ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతుంటే ప్రభుత్వం మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా మున్సిపోల్స్ పై ఉంటుంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ కు కలిసొచ్చాయి. మున్సిపోల్స్ లో మాత్రం ఓటరు నాడి వేరేగా ఉంటుంది. చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. సెలవులు పొడిగించడంపై పట్టణ ప్రజలో తీవ్ర వ్యతిరేకత ఉంది, అది ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 18 రోజులు గడుస్తుంది, రోజు రోజుకు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. సమ్మె ఎఫెక్ట్ తో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు, సమ్మె పై సీఎం, మంత్రుల ప్రకటనలను వ్యతిరేకిస్తున్నారు. పైగా సమ్మెలో ఉన్న 50వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, వారి బంధువులంతా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డవారే. ఈ సమయం లో మున్సిపోల్స్‌కు వెళ్తే ఇబ్బందులు తప్పవని టిఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితి, ఆలాగని ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కోర్టు తీర్పు ను గౌరవిస్తూనే ఎన్నికలను ఇంకొన్ని రోజులు వాయిదా ఎలా వేయాలి అని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగానే కోర్టు తీర్పులో ఓ అంశాన్ని వాడుకోబోతున్నారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ స్టే ఉంది. సో అక్కడ స్టే ఎత్తివేస్తేనే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది అధికార టీఆరెఎస్ పార్టీ.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే...

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే…

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

high tension at huzur nagar

ధాన్యం కొనుగోలు చెయ్యనప్పుడు ప్రభుత్వం ఎందుకు ?

Revanth reddy In GHMC Elections campaign

గల్లీ లో కుస్తీలు… ఢిల్లీ లో దోస్తిలా ?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)