రేపటి నుంచి లాటరీ పద్ధతిలో రాజీవ్ స్వగృహ ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ షెడ్యూల్ ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ హెచ్ఎండీఏ వెబ్సైట్ లో ఉంచామని అధికారులు తెలిపారు.
ఈ ప్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ ఎండీఏ) నోటిఫికేషన్ ఇవ్వగా.. రేపటి నుంచి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించనున్నారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రేపు ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ ప్రక్రియ ఫేస్బుక్, యూట్యూబ్లలో లైవ్ స్ట్రీమింగ్కు ఏర్పాట్లు చేశారు. 27న పోచారం, 28న బండ్ల గూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం డ్రా తీయనున్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి పూర్తి ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు రికార్డ్ చేయనున్నారు.
ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఆధార్ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.