ప్రముఖ నటి అమలాపాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి వెళ్తుండగా ఆమెను అధికారులు అడ్డుకున్నారు. నిజానికి మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.అన్యమతస్తులకు ప్రవేశం లేదు.ఈ కారణంగా ఆలయ సందర్శనకు వచ్చిన ఆమెను అడ్డుకున్నారు సిబ్బంది. ఈ విషయాన్ని ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్లో రాసుకొచ్చారు. తాను అమ్మవారిని చూడలేకపోయినా ఆమె ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవించానని అమలాపాల్ రిజిస్టర్లో రాశారు.
2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోకి తనను అనుమతించక పోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు.
మత వివక్షలకు త్వరలో తెరపడాలని ఆశిస్తున్నట్టు రిజిస్టర్లో పేర్కొన్నారు. మత పరంగా కాకుండా మనుషులందరూ సమానమేనని చూసే సమయం వస్తుందని అమలాపాల్ అభిప్రాయ పడ్డారు.