• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పిచ్చోడి చేతిలో రాయి!

Published on : May 15, 2020 at 5:39 pm

narsimha reddy

నర్సింహా రెడ్డి
జర్నలిస్ట్

అమరావతి ఉద్యమం నేటికి 150 రోజులు పూర్తి చేసుకుంది. కరోనా సమయంలో కూడా అక్కడి రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మంచి నగర నిర్మాణం జరుగుతుంది, రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది అని నమ్మిన రైతులు అమ్మ లాంటి భూమిని త్యాగం చేశారు. నగరంగా అభివృద్ధి చెందితే తాము ఆర్థికంగా బలపడుతాం అని నమ్మిన రైతుల ఆశలపై నీళ్లు చల్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రంలో ఉన్న నేను కూడా మొన్నటిదాకా కలిసి ఉన్న తోటి తెలుగువాళ్లకు ఒక మంచి రాజధాని ఏర్పాటుకాబోతుంది. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక నగరం ఏర్పాటు అవుతుంది అని బలంగా నమ్మిన. జగన్ అధికారంలోకి రావడానికి పడిన కష్టం, తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాలు విన్న నేను జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తో పాటు నేను ఉద్యోగ రిత్యా కొన్ని రోజులు పాదయాత్రలో పాల్గొ న్నాను. కడపలో పాదయాత్ర ప్రారంభం అయిన అనంతరం జగన్ ప్రసంగిస్తూ. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండేలా నా పరిపాలన ఉంటుంది. 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అని ప్రకటించారు. ఆ మాటలు విన్న తరువాత జగన్మోహన్ రెడ్డి కి దేనిపై ఆశలు లేవు, అవినీతి ఆరోపణలపై జైల్ కు వెళ్లివచ్చిన జగన్, వాటిని తన చరిత్రనుంచి మరిచిపోయేలా, ప్రజలు మనసులు గెలిచేలా పాలన చేస్తారేమో అనిపించింది. పాదయాత్రలో ప్రజల స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అనుకున్నా. 2019 ఎన్నికల ఫలితాలు చూశాక జగన్ కష్టానికి ప్రతిఫలం లభించింది, పాదయాత్రలో చెప్పినట్లు పాలన సాగుతుంది అనుకున్న.

అధికారంలోకి వచ్చిన అతి తొందరలోనే జగన్ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయి. ముఖ్యంగా రాజధాని తరలింపు పై జగన్ నిర్ణయం పిచ్చోడి చేతిలో రాయిలా అనిపించింది. 33 వేల ఎకరాలతో రాష్ట్రం నడిబొడ్డున ఒక నగర నిర్మాణాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తే, రాష్ట్ర ప్రజల మనుసుల్లో తమ రాజధాని అమరావతి అని బలపడిన నగరాన్ని నామ రూపాలు లేకుండా చేయాలి అనే జగన్ నిర్ణయం పిచ్చోడి చేతిలో రాయి కాకపోతే మరేంటి. జగన్ కు ఇబ్బంది లేకుండా భూమిని గత ముఖ్యమంత్రి సేకరించారు, కొన్ని భవనాల పనులు ప్రారంభం అయ్యాయి, అన్నింటికీ మించి అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఆమోదం వచ్చింది. అలాంటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయిన ఏం చేస్తారు? ఆ పనులను అలాగే కొనసాగిస్తే జగన్ పాలన ముగిసే సరికి అమరావతికి కొంత రూపం వచ్చేది. దాని వల్ల రాష్ట్రానికి, భూములు ఇచ్చిన రైతులకు ఎంతో లాభం జరిగేది. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఏమి చేయలేదు, జగన్ రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు అని రాజకీయంగా వైసీపీ కి లాభం జరిగేది.

ప్రచారం లో జగన్ మాటలకు ప్రస్తుత పాలన పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక దిక్కుమాలిన సౌతాఫ్రికా మాడల్ ను చూపిస్తూ రాజధానిని వైజాగ్ తరలించడం చూస్తుంటే, వైజాగ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఉన్న జగనే ఇప్పుడు ఉన్నట్లు అనిపిస్తుంది, ఎలాంటి మార్పు లేదు. పాదయాత్రలో జగన్ చెప్పిన సుద్దులు అధికారం కోసం చెప్పిన అబద్దాలుగా అనిపిస్తున్నాయి. రాజధాని రైతుల త్యాగాలను గుర్తించని జగన్ తన మంత్రులతో వాళ్ళను చాలా అవమాన పరిచారు. రాజధాని మార్పుకు ఒక కులం కారణం అని కుల చిచ్చు పెట్టె ప్రయత్నం చేశారు. రాజధాని ఒక్క ప్రాంతం లోనే ఉండాలా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం అని ప్రాంతీయ విభేదాలు సృష్టించారు. టీడీపీ వాళ్ళు కొన్న నాలుగు వేల ఎకరాల కోసం రాజధాని మారుస్తున్నాం అని చెప్పి మరింత పలుచన అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత అవమానించినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతుల పట్టుదల చూస్తుంటే జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వస్తుందేమో.

ఆంధ్రులు చాలా తెలివి గలా వాళ్ళు అని అంటుంటారు. అవును వాళ్లకు తెలివి ఎక్కువే కులాల పై ప్రేమ ఎక్కువే. కులాల పంచాయితిలో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అమరావతి నిర్మాణం అనేది రాష్ట్రం మొత్తానికి సంబందించిన అంశం. అక్కడ అద్భుతమైన నగరం నిర్మాణం జరిగితే అటు శ్రీకాకులం, ఇటు అనంతపురం వరకు ప్రజలకు అందరికి లాభం జరుగుతుంది. ఒక నగరం ఏర్పాటు జరిగితే యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్టికంగా రాష్ట్రం బలపడుతుంది. అమరావతిపై అందరికి హక్కు ఉంటది.కానీ అమరావతి తరలింపుపై మాత్రం కేవలం భూములు ఇచ్చిన రైతులు మాత్రమే ఉద్యమం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. రాయలసీమ ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు , కృష్ణ,.గుంటూరు ప్రజలు కూడా తమ కు సంబంధం లేనట్లు సినిమా చూస్తూ ఉండిపోయారు. జరుగుతున్న నష్టాన్ని, రాబోవు ప్రమాదాన్ని గ్రహించలేక పోతున్నారు. అమరావతి ఒక కులానికి సంబంధించింది అని జగన్ ఒక వర్గం ప్రజల్లోకి బాగా ఎక్కించారు. ఇప్పుడు మేల్కొనక పోతే జరిగే నష్టాన్ని ప్రజలు గ్రహించాలి. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కొలుకోదు. ఆంధ్రుల రాజధాని త్రిశంకు స్వర్గంలో ఉంది, అది ఎప్పుడు బయట పడుతుందో తెలియదు. ఆలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. జగన్ నిర్ణయాలు, ప్రజల అలసత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాస్త అంధ ప్రదేశ్ గా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

క్రాక్ డైరెక్ట‌ర్ తో బాల‌య్య‌

క్రాక్ డైరెక్ట‌ర్ తో బాల‌య్య‌

మెగా ఫోన్ అందుకున్న క్రాక్ డైరెక్ట‌ర్

మెగా ఫోన్ అందుకున్న క్రాక్ డైరెక్ట‌ర్

కాశ్మీర్ బార్డ‌ర్ లో సైనికుల జీవితాన్ని ఆవిష్క‌రించే డాక్యుమెంట‌రీతో రానా

కాశ్మీర్ బార్డ‌ర్ లో సైనికుల జీవితాన్ని ఆవిష్క‌రించే డాక్యుమెంట‌రీతో రానా

mega prince varun tej six pack look for his new movie boxer

బాక్స‌ర్ గా వ‌రుణ్ తేజ్- ఫ‌స్ట్ లుక్ మాములుగా లేదుగా…!

ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ ఇదే!

ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ ఇదే!

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై హైకోర్టు తీర్పు రిజ‌ర్వ్

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల‌పై హైకోర్టు తీర్పు రిజ‌ర్వ్

ప్ర‌ధాని ప్ర‌శంస‌లు.. బీసీసీఐ రూ. 5 కోట్ల బోన‌స్

ప్ర‌ధాని ప్ర‌శంస‌లు.. బీసీసీఐ రూ. 5 కోట్ల బోన‌స్

ఆసీస్ గ‌డ్డ‌పై భార‌త కుర్రాళ్ల విశ్వ‌రూపం

ఆసీస్ గ‌డ్డ‌పై భార‌త కుర్రాళ్ల విశ్వ‌రూపం

ఏపీ స‌ర్కార్‌కు షాక్.. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌న్న హైకోర్టు

ఏపీ స‌ర్కార్‌కు షాక్.. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌న్న హైకోర్టు

ఇంత‌కి రైతు బంధు స‌మితులు ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

ఇంత‌కి రైతు బంధు స‌మితులు ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

uttam kumar reddy

ఓయూ ద‌ళిత బిడ్డ‌పై ఉత్త‌మ్ బూతులు…!

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)