పంజాబ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎంగా కెప్టెన్ రాజీనామా.. చరణ్ జీత్ సింగ్ నియామకం.. పార్టీ అధ్యక్ష పదవికి సిద్ధూ రిజైన్.. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు పెట్టుకుని.. కాంగ్రెస్ లో ఏంటీ గోల అనే విమర్శలు వచ్చాయి. అధిష్టానం చక్కబెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ఏదీ వర్కవుట్ కావడం లేదని తెలుస్తోంది. తాజాగా కెప్టెన్ అమరీందర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
రెండు రోజులుగా అమరీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఆపేందుకే సిద్ధూతో రాజీనామా చేయించారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా, అమరీందర్ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో సిద్ధూకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అలకబూనిన అమరీందర్ ను కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పదవి నుంచి తప్పించింది. అయితే అనూహ్యంగా చన్నీని సీఎంని చేసింది. గొడవ సద్దుమణిగింది అనుకునే టైమ్ లో అమరీందర్ బీజేపీ గూటికి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో సిద్ధూ రాజీనామా చేశారు. అయినా కెప్టెన్ చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి.
ఢిల్లీకి వెళ్లబోయే ముందు మీడియాతో మాట్లాడిన అమరీందర్.. తన ఢిల్లీ పర్యటన రాజకీయ నేతలను కలిసేందుకు కాదని చెప్పారు. పంజాబ్ కొత్త సీఎం కోసం అధికార నివాసమైన కపుర్తలా హౌస్ ను ఖాళీ చేసేందుకే వెళ్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడబోనని చెప్పారు. అయితే తన మాటలకు విరుద్ధంగా అమిత్ షాను అమరీందర్ కలవడం చర్చనీయాంశంగా మారింది. భేటీ అనంతరం ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం గురించి చర్చించాను’’ అంటూ పోస్ట్ చేశారు.
Met Union Home Minister @AmitShah ji in Delhi. Discussed the prolonged farmers agitation against #FarmLaws & urged him to resolve the crisis urgently with repeal of the laws & guarantee MSP, besides supporting Punjab in crop diversification. #NoFarmersNoFood
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 29, 2021
Advertisements