ఓ వైపు కమర్షియల్ చిత్రాలు.. మరోవైపు సోషల్ మెసేజ్ చిత్రాలను చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ దూసుకుపోతున్నారు సూర్య.
‘ఆకాశం నీ హద్దురా’ మూవీతో నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఆయన ఫ్యామిలీతో సహా ముంబయికి షిఫ్ట్ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకోసం ఆయన ముంబయిలో రూ. 70 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది.
ముంబయిలో సెలబ్రిటీలు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశారట. నిజానికి ఈ ఇంద్రభవనం లాంటి ఇల్లును కొనుగోలు చేయడానికి ఆయనకు రూ.68కోట్లు అయ్యాయట. రిజిష్ట్రేషన్, ఇతర ఖర్చుల వల్ల మరో రూ. 2 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిసింది.
గార్డెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కింగ్, లైబ్రరీ, థియేటర్ ఇలా అన్ని అత్యాధునిక హంగులు కలిగి ఉన్న ఇంటిని తీసుకున్నారట సూర్య. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, హీరోయిన్ జ్యోతికను సూర్య 2006లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి సంతానం. అలాగే ఈయన ఓ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం సూర్య.. శివ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ‘Suriya 42’గా రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మూవీతోనే ఆయన పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్నారు. మార్కెట్లో ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పది భాషల్లో త్రీడీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నారట.
డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్తో పాటు హిందీ రైట్స్ ఏకంగా రూ.100కోట్లకు అమ్ముడుపోయాయనే కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది.
చిత్రీకరణ పూర్తికాక ముందే రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోవడం అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రం తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ అనే మూవీ చేయనున్నారు.