సాధారణంగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఆయనకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఏ విషయంపైనైనా మహీంద్రా రియాక్ట్ అవుతూంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు విషయాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో మందిని ఆలోచింపజేయడం, ప్రోత్సహించడం చేస్తుంటారు. తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే గురించి ఆయన ప్రస్తావన చేశారు.
దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా పేర్కొన్నారు. కీలకమైన ఇలాంటి అనుసంధాన రహదారులతో రవాణా సమయం తగ్గించడం వల్ల దేశ జీడీపీ లెక్కించలేని విధంగా పెరుగుతుంది. చాలా బాగా చేశారు. గుడ్ అంటూ మహీంద్రా పేర్కొన్నారు.
దీనికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోను జత చేశారు. ప్రస్తుతం 24 గంటలు పట్టే సమయం 12 గంటలకు తగ్గిపోనుండడం గమనార్హం. జర్మన్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకువెళ్లేందుకు అనుకూలమైన 8లేన్ల రహదారి ఇది. హర్యానా, రాజస్థాన్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ వెళ్తుంది.
This is going to be the most critical artery of India’s economic highway. Cutting down transit times on such vital connectivity links will boost our GDP growth rates in immeasurable ways. Can’t wait to glide down it…Well done and thank you, @nitin_gadkari https://t.co/14ctK5oik6
— anand mahindra (@anandmahindra) January 30, 2023