• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » పట్టువదలని అనసూయ..మొత్తానికి సాధించింది!!

పట్టువదలని అనసూయ..మొత్తానికి సాధించింది!!

Last Updated: November 27, 2022 at 8:51 am

ఈ మధ్యకాలంలో వార్తలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ యాంకర్ అనసూయ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఏపీకి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు అనే వ్యక్తిని అనసూయ కేసు ప్రకారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.

అతని మీద 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. సదరు వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో తన ఫోటోలు కూడా వాటిలో ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఆమె ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సదరు నిందితుడు 267 ట్విట్టర్ అకౌంట్లు మైంటైన్ చేస్తూ వాటి ద్వారా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నట్లుగా గుర్తించారు. సదర్ నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పసలపూడి అనే గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబింగ్ వర్క్ చేసినందుకు తర్వాత మన దేశానికి తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.

సినీ పరిశ్రమలోని హీరోయిన్లు, యాంకర్స్ టార్గెట్ చేస్తూ వారి హాట్ ఫోటోలను సేకరించి అసభ్యంగా రాతలు రాస్తున్నట్లుగా గుర్తించారు. కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి వంటి వారి ఫోటోలను కూడా వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇవేవీ అతను మార్ఫ్ చేసిన ఫోటోలు కావు సోషల్ మీడియాలో సదరు సెలబ్రిటీలు షేర్ చేస్తున్న ఫోటోలు అతను కూడా షేర్ చేస్తూ వాటి మీద అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లు గుర్తించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఇద్దరు అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటామని కోర్టుకెక్కారు..!

సుప్రీంకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు

హైదరాబాద్ కి ముంచుకొస్తున్న హై టెంపరేచర్…!

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేసీఆర్‭ కు చివరి ఎన్నికలు ఇవే..!

కేటీఆర్ అబద్దాలను కూడా వినసొంపుగా చెప్పారు!

ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు!

ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు

గట్టు బాగు చేయడానికి పెట్టిన నిప్పు… ముప్పుతెచ్చింది.!

ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..!

తుంగతుర్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా!

ఫిల్మ్ నగర్

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap