నెల్లూరులో చిన్నారితో పని చేయించిన ఘటనపై యాంకర్ రష్మీ స్పందించారు. దీనిని చిన్న విషయంగా చూడకూడదని… ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఈ ఘటనపై వ్యతిరేకంగా గళం విప్పాలని ట్వీట్ చేశారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ నిమిత్తం గదులను శుభ్రం చేయిస్తున్న పోలీసులు 6 సంవత్సరాల బాలికతో రూమ్ తుడిపించారు. ఆ బాలిక వాచ్మెన్ కుమార్తె అని తెలుస్తుంది. అయితే పోలీసులే చిన్న బాలికతో అటువంటి పని చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠినంగా శిక్షించాలనే చట్టాలు ఉన్నా.. అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
This is not normal and shud not be considered normal
pls raise your voice if you see such a thing happening #saynotochildlabour https://t.co/PilM0YHf3e— rashmi gautam (@rashmigautam27) May 18, 2020