ఓ యువకుడు బరితెగించాడు. మైనర్ బాలికనే విచక్షణ లేకుండా మైనర్ బాలకకు తాళికట్టాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో శ్రీకాంత్ అనే యువకుడు మైనర్ బాలికమెడలో తాళి కట్టాడు. అమిత్యాలలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన హేమలత అనంతపురం జిల్లా ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీకాంత్.. ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుందామంటూ మెడలో పసుపు కొమ్ము కట్టేశాడు. రామప్ప, ఆదిలక్ష్మి దంపతుల నాల్గవ కుమార్తె హేమలత. ఇటీవల ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు.
తల్లి వ్యవసాయ కూలి, మరోవైపు శ్రీకాంత్ తండ్రి కూడా చనిపోయాడు. యువకుడి తల్లి ఉమాదేవి వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.