• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్‌!

ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్‌!

Last Updated: March 14, 2023 at 12:24 pm

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సంక్షేమం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందని గవర్నర్ తెలిపారు.

ap budget meetings governer

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభా సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు.

ఆర్ధికాభివృద్ధిలో ఆంధ‌్రప్రదేశ్‌ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నట్లు గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవంలో వివరించారు. ఏపీలో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నట్లు వివరించారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

అవినీతికి తావులేవకుండా అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. నాలుగేళ్లుగా ఏపీలో సుపరిపాలన అందించినట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారి సంక్షేమ పథకాల అమలు కోసం వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. కూరుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీను, వైఎస్సార్ కడపలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 80లక్షల మంది పిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 44.49లక్షల మంది తల్లులకు రూ.19.61కోట్ల రుపాయలను నేరుగా బదిలీ చేసినట్లు చెప్పారు.

గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో శాసన సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుంది. శాసససభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది బిఏసిలో నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 7,8 రోజుల సభా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. బిఏసి సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు క్యాబినెట్ అమోద ముద్ర వేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్ రూ.2.60లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంక్షేమంతో పాటు నగదు బదిలీ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వరాలు కురిపించే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో కీలక అంశాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వివరాలను గవర్నర్ సభకు వివరిస్తున్న క్రమంలో శాసనసభ్యులు ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు

Primary Sidebar

తాజా వార్తలు

కేటీఆర్, బండి సంజయ్ ల ఉగాది పంచాంగం..!

భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. కేసీఆర్, గవర్నర్ లకు ఆహ్వానం

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

పేపర్ల లీకేజీ కేసులో 42 మందికి సిట్ నోటీసులు

ఈడీ విచారణ తర్వాత.. కవిత కౌంటర్ వీడియో!

కొడుకు పెళ్ళి కోసం యజమాని ఇంటికి కన్నం…!

గురుద్వారాలో చొరబడి.. అమృత్ పాల్ ‘విలనిజం’ !

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ సంచలన నిర్ణయం

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసారానికి ఏర్పాట్లు..!

పెరుగుతున్న కరోనా కేసులు.. మోడీ సమీక్ష

కేసీఆర్ తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ!

సమస్యలు పట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నాడు!!

ఫిల్మ్ నగర్

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap