ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆద్వర్యంలో మంత్రిమండలి సమావేశం బుధవారం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్ష చెయ్యనున్నారు. ఇనామ్ భూములకు సంబంధించి కూడా ముఖ్య నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రిటైర్డ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి సిద్ధం చేసిన మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. అయితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవలి ఉత్తర్వులో స్పష్టత లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ హయాంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమితులైనవారు కూడా ఈ ఉత్తర్వు ప్రకారం ఉద్వాసనకుగురి కావలసిన పరిస్థితి నెలకొంది. దీనిపై కేబినెట్ భేటీలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది.