ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,737 శాంపిల్స్ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు 11 మంది మృతి చెందారు. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,40,408కు పెరిగింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,12,714కు చేరింది.
అలాగే ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,089కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,905 యాక్టివ్ కేసులు ఉన్నాయి.