ఏపీకి నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని మరవక ముందే మళ్లీ వర్షాలు తప్పవంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీకి మరో వాయుగండం ముప్పు ఉందని సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడగా, తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఈ ఉపరితలం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న ఈ వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.